Kurnool: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం

ABN , First Publish Date - 2021-07-19T14:10:15+05:30 IST

నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళ నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యం కోసం చేరింది. అయితే..మహిళ కడుపు నొప్పితో బాధపడుతుందని

Kurnool: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం

కర్నూలు: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళ నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యం కోసం చేరింది. అయితే..మహిళ కడుపు నొప్పితో బాధపడుతుందని డాక్టర్లు సిజేరియన్ చేసారు. సిజేరియన్ చేసే సమయంలో మహిళ కడుపులో గుడ్డ ముక్కను మరచి కుట్లు వైద్యులు వేసారు. దీంతో మహిళకు మళ్లీ నొప్పి రావడంతో మరో చోట స్కానింగ్ చేయించడంతో మహిళ కడుపులో గుడ్డ ముక్క ఉన్నట్లు తెలింది. దీంతో మహిళ వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసి గుడ్డ ముక్కను తొలగించారు. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం వల్లే జరిగిందని మహిళ బంధువులు ప్రభుత్వాస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.


Updated Date - 2021-07-19T14:10:15+05:30 IST