క్వారీలో పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-05-08T18:07:55+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై

క్వారీలో పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి

అమరావతి : కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ బాధితులకు నష్టపరిహారం అందినట్లుగానే.. క్వారీలో మృతి చెందినవారికి కూడా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-05-08T18:07:55+05:30 IST