పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన

ABN , First Publish Date - 2021-08-31T19:39:33+05:30 IST

నారా లోకేష్ పోలవరం ముంపు మండలాల్లో మంగళవారం పర్యటిస్తున్నారు.

పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన

పోలవరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలవరం ముంపు మండలాల్లో మంగళవారం పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ పర్యటన కొనసాగుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమస్యలు విని వారికి తగిన సూచనలు చేస్తున్నారు. ఇవాళ భ‌ద్రాచ‌లం, టేకుల‌బోరు, శ్రీరామ‌గిరి, చింతూరులో లోకేష్ పర్యటిస్తారు. బుధవారం రంప‌చోడ‌వ‌రం, దేవీప‌ట్నం, పెద‌వేంప‌ల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేష్ పర్యటిస్తారు. 


అంతకుముందు లోకేష్ మంగళవారం ఉదయం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున లోకేష్‌ను.. శాలువా, జ్ఞాపికతో ఆలయ ఈవో శివాజీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శాసనసభ్యులు పొదెం వీరయ్య, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టీడీపీ నాయకులు బక్కని నర్సింహులు, కొండపల్లి రామచంద్రరావు, కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారామ్, కోనేరు రాము, ఎస్‌కే అజీమ్, రంజిత్, జ్యోతుల నవీన్, వరపుల రాజా, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-08-31T19:39:33+05:30 IST