అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-10-24T11:09:26+05:30 IST

కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

అండగా ఉంటాం

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 


వెల్దుర్తి, అక్టోబరు 23: కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లాకు వెళుతున్న ఆయనను వెల్దుర్తి సమీపంలోని టోల్‌ ప్లాజా వద్ద మండల నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు.  ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, వివిధ పనుల బిల్లులను నిలిపివేసి ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని కార్య కర్తలు లోకేష్‌ దృష్టికి తెచ్చారు.  లోకో్‌ష మాట్లాడుతూ ఇవి కోర్టులో ఉన్నాయని చట్టం ప్రకారం 12 శాతం వడ్డీతో కలిపి లబ్ధిదారులకు అందుతాయన్నారు. పత్తికొండకు ఇన్‌చార్జిని నియమించాలని కార్యకర్తలు కోరారు. గుంటుపల్లె వెంకటరాముడు, సూదెపల్లె జయరాముడు, మల్లెపల్లె రమణరెడ్డి , అల్లుగుండు బాలమద్ది, మంగంపల్లె శ్రీను, రామకృష్ణ, బొమ్మిరెడ్డిపల్లె గిరి, రాజశేఖర్‌, మురళి పాల్గొన్నారు. 


కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పోతుదొడ్డి రైతులు మాజీ మంత్రి నారా లోకేష్‌ ఎదుట శుక్రవారం వాపోయారు. 

Updated Date - 2020-10-24T11:09:26+05:30 IST