సీఎం జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ
ABN , First Publish Date - 2021-07-06T23:43:01+05:30 IST
సీఎం జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. 17 లక్షల విద్యార్థుల భద్రతపై సీఎం దృష్టి సారించాలన్నారు. అలాగే సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందుకు అభినందనలు తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువకి వచ్చిందన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారని లేఖలో పేర్కొన్నారు.