భయపడవద్దు... మీ తరపున పోరాటం చేస్తాం: లోకేష్
ABN , First Publish Date - 2021-11-08T22:21:02+05:30 IST
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను టీడీపీ నేత నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. పోలీసుల తీరును నారా లోకేష్కు విద్యార్థులు వివరించారు.
అమరావతి: పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను టీడీపీ నేత నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. పోలీసుల తీరును నారా లోకేష్కు విద్యార్థులు వివరించారు. అసభ్య పదజాలంతో దూషించి పోలీస్ జీపుల్లో విద్యార్థులను చితక్కొట్టారు. తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని లోకేష్కు విద్యార్థుల వివరణ ఇచ్చారు. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని లోకేష్ మండిపడ్డారు. భయపడవద్దు.. విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని, ధైర్యంగా ఉండండన్నారు.