విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోంది.. జగన్ రెడ్డి కొంటున్నాడు: నారా లోకేష్

ABN , First Publish Date - 2021-03-09T19:47:42+05:30 IST

అమరావతి: విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోంది.. జగన్ రెడ్డి కొంటున్నాడు: నారా లోకేష్

అమరావతి: విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గంగిరెద్దుల్లా తలాడించడానికి 28 మంది ఎంపీలున్నారని.. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగమేంటని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘‘విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ రెడ్డి కొంటున్నాడు.ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం,వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.  




Updated Date - 2021-03-09T19:47:42+05:30 IST