ఆంధ్ర వర్సిటీలో కుల వివక్ష దారుణం: నారా లోకేష్
ABN , First Publish Date - 2020-06-02T22:14:05+05:30 IST
అమరావతి: ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణమని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణమని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందంపై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
‘‘ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణం. దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందం గారిపై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏయూలో ప్రేమానందం గారిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
అణగారిన వర్గాల హక్కులకు దిక్కుగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి జగన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైకాపా నేతల దౌర్జన్యాలు, అణిచివేతలతో దళితులు దగా పడ్డారు.
కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ గారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. దళితులకు జరుగుతున్నఅన్యాయాలపై ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ గారిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
మాస్కుల్లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని ఉగ్రవాది కంటే ఘోరంగా హింసించి బంధించారు. దళితులకు ఉపాధి కల్పించే లిడ్ క్యాప్ భూములు లాగేసుకున్నారు. దళితుల గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న నిరంకుశ జగన్ ప్రజావ్యతిరేక పాలనపై తిరుగుబాటు తప్పదు’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.