ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు?: నారా లోకేష్
ABN , First Publish Date - 2020-08-04T20:51:22+05:30 IST
అమరావతి: ఎన్నికలకు ముందు ఏపీ సీఎం జై అమరావతి అని నినదించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి: ఎన్నికలకు ముందు ఏపీ సీఎం జై అమరావతి అని నినదించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తమ అన్న రాజధానిలో సొంతిల్లు నిర్మించుకున్నారని అన్ని ప్రాంతాల వైసీపీ నేతలు బల్లగుద్ది చెప్పారన్నారు.
‘‘ఎన్నికల ముందు జై అమరావతి అని నినదించారు. అందుకే మా అన్న రాజధానిలో సొంతిల్లు నిర్మించుకున్నారు అని, అన్ని ప్రాంతాల వైసీపీ నాయకులూ బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు జగన్ రెడ్డి గారు ? మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయానికి ఎందుకు జంకుతున్నట్టు?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.