మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్‌గారు: లోకేష్

ABN , First Publish Date - 2020-05-28T15:58:24+05:30 IST

అమరావతి: తన జీవితమంతా మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్‌గారు: లోకేష్

అమరావతి: తన జీవితమంతా మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువని కొనియాడారు. 


‘‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు' అన్నది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ కోసం అందించిన నినాదం కావచ్చు. కానీ అంతకుముందే తన జీవితమంతా ఈ మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ గారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువు ఎన్టీఆర్


బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది... పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది...  మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది.... నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2020-05-28T15:58:24+05:30 IST