అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని అందించేది పోలీసులే: నారా లోకేష్
ABN , First Publish Date - 2020-10-21T18:31:09+05:30 IST
అమరావతి: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా విశ్వకవి ఠాగూర్ రాసిన
అమరావతి: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా విశ్వకవి ఠాగూర్ రాసిన కవితను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు కేటీఆర్ నివాళులర్పించారు. "ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరగగలడో... ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు అని ప్రార్థించారు విశ్వకవి ఠాగూర్. అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులే. అంతటి నిస్వార్ధమైన, అంకితభావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరికీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.