మానవత్వాన్ని చాటుకున్న నారా లోకేష్

ABN , First Publish Date - 2021-08-18T02:21:43+05:30 IST

కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు.

మానవత్వాన్ని చాటుకున్న నారా లోకేష్

కర్నూలు: కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద నారా లోకేష్‌ను మైనార్టీ యువకుడు అమీద్ బాషా కలిశారు. లోకేష్‌తో తన సమస్యలను చెప్పుకుని అమీద్ బాషా సాయం కోరాడు. వెంటనే లోకేష్ స్పందించి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని అమీద్ బాషాకు నారా లోకేష్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-18T02:21:43+05:30 IST