జగన్ రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-06-11T22:16:51+05:30 IST
సీఎం జగన్రెడ్డి రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అమరావతి: సీఎం జగన్రెడ్డి రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందన్నారు. జగన్ పాలన విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ట్యాక్స్లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లూ పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదుడురెడ్డి దెబ్బకి దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ ధర.. సెంచరీ దాటి (101.61) నాటౌట్గా రికార్డులు సృష్టించిందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీని అభివృద్ధిలో అట్టడుగు స్థానం, కొవిడ్ కేసుల్లో ఐదోస్థానానికి చేర్చిన ఘనత జగన్దేనని సెటైర్లు వేశారు. పెట్రోల్ ధరల పెంపులో సౌత్లో మన రాష్ట్రాన్ని నెంబర్వన్గా నిలిపారని.. ఇది జగన్రెడ్డి పాపం, ప్రజలకు శాపంగా మారిందని లోకేష్ ధ్వజమెత్తారు.