అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-04-13T21:10:14+05:30 IST
అక్రమ కేసులు పెట్టి కూన రవికుమార్ను వేధిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూన రవికుమార్ సతీమణి ప్రమీలను లోకేష్ ఫోన్లో పరామర్శించారు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అవినీతిని మీడియా ముఖంగా ఎండగడుతున్నందుకే కూనపై సీఎం జగన్రెడ్డి కక్షగట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా జగన్ కక్ష తీరడం లేదన్నారు. కూన రవికుమార్ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.