కేంద్రం అమ్మేస్తోంది.. జగన్ కొంటున్నాడు: లోకేష్

ABN , First Publish Date - 2021-03-09T19:37:35+05:30 IST

విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోంది ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి కొంటున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

కేంద్రం అమ్మేస్తోంది.. జగన్ కొంటున్నాడు: లోకేష్

విశాఖ: విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోంది ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి కొంటున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ అని మండిపడ్డారు. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంతమంది ఉండి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ ఎన్నికుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం.. జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి జగన్‌రెడ్డి  లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల డ్రామాలు ఆపాలని లోకేష్ అన్నారు.

Updated Date - 2021-03-09T19:37:35+05:30 IST