ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్

ABN , First Publish Date - 2021-10-21T00:30:15+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని ....

ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలో వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కొందరు పోలీస్ అధికారుల తీరుపై కూడా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వల్ల మొత్తం ఏపీ పోలీసులకు చెడ్డ పేరుతో వస్తుందని చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ఒక్కర్నీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు. వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు రికార్డైన సీసీ ఫుటేజ్‌ను డీజీపీకి అందజేసినా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం శోఛనీయమని లోకేశ్ వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-10-21T00:30:15+05:30 IST