కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ

ABN , First Publish Date - 2020-09-28T21:25:56+05:30 IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని లేఖలో

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ

అమరావతి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని లేఖలో నారా లోకేష్‌ కోరారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్‌ రూ.80 కోట్లుగా ఉందని తెలిపారు. దీన్ని బ్రాంచ్‌ కార్యాలయంగా కుదించడం సరికాదని చెప్పారు. ఇప్పటికే కరోనా వల్ల చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నిర్ణయంతో వారు కోలుకునే అవకాశాలు మరింత దెబ్బతింటాయని లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T21:25:56+05:30 IST