జగన్కు నారా లోకేష్ లేఖ
ABN , First Publish Date - 2021-10-29T00:19:52+05:30 IST
సీఎం జగన్కు నారా లోకేష్ లేఖ రాశారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై లోకేష్ లేఖ రాశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్
అమరావతి: సీఎం జగన్కు నారా లోకేష్ లేఖ రాశారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై లోకేష్ లేఖ రాశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయని విమర్శించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను, ఆస్తులను దక్కించుకునేందుకే యత్నిస్తున్నారని తప్పుబట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ స్కూళ్లు మూతపడకుండా చూడాలన్నారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని లేఖ లోకేష్ స్పష్టం చేశారు.