స్వామిపై ఎందుకీ దొంగ దైవ‌భ‌క్తి: లోకేష్

ABN , First Publish Date - 2021-10-14T00:06:13+05:30 IST

కొండ‌పై గోవింద‌నామాల బ‌దులు జ‌గ‌న్‌ నామస్మరణ మ‌హాప‌రాధం అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. స్వామి అమ్మవార్లకు ప‌దేప‌దే అప‌చారాలు త‌ల‌పెడుతున్నారని చెప్పారు.

స్వామిపై ఎందుకీ దొంగ దైవ‌భ‌క్తి: లోకేష్

అమరావతి: కొండ‌పై గోవింద‌నామాల బ‌దులు జ‌గ‌న్‌ నామస్మరణ మ‌హాప‌రాధం అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. స్వామి అమ్మవార్లకు ప‌దేప‌దే అప‌చారాలు త‌ల‌పెడుతున్నారని చెప్పారు. జ‌గ‌న్‌రెడ్డిని ర‌క్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్‌ స‌తీమ‌ణి అప‌చార‌పు నామ‌స్మర‌ణ స్వామివారికి తీర‌ని క‌ళంకమన్నారు. భ‌క్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. వేద‌పండితులు త‌ల‌పై వేసిన అక్షింత‌ల్ని అస‌హ్యంగా దులుపుకోవ‌డం, ప్రసాదం వాస‌న చూడ‌టం....స్వామిపై ఎందుకీ దొంగ దైవ‌భ‌క్తి జ‌గ‌న్‌రెడ్డి గారూ? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-14T00:06:13+05:30 IST