నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలి: లోకేశ్

ABN , First Publish Date - 2020-12-05T17:36:05+05:30 IST

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రైతులతో మాట్లాడిన ఆయన వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలి: లోకేశ్

ఇంటర్నెట్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రైతులతో మాట్లాడిన ఆయన వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన.. ఈ రోజు తాను నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానన్నారు. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించినట్టు తెలిపారు. వరుస తుఫాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని..  గతంలో వచ్చిన నష్టానికి కూడా ఇప్పటి వరకూ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ - క్రాప్‌లో ఎంటర్ కాలేదు కాబట్టి ప్రభుత్వ సహాయం రాదు అనడం దారుణమని లోకేశ్ అన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 



Updated Date - 2020-12-05T17:36:05+05:30 IST