నేను విదేశాల్లో చదువుకున్నానని సాఫ్ట్ అనుకోవద్దు: లోకేష్
ABN , First Publish Date - 2021-04-09T01:48:01+05:30 IST
తాను విదేశాల్లో చదువుకున్నానని సాఫ్ట్ అనుకోవద్దని, జగన్రెడ్డి తాత, తండ్రి మన జుట్టు కూడా పీకలేకపోయారని
నెల్లూరు: ‘‘నేను విదేశాల్లో చదువుకున్నానని సాఫ్ట్ అనుకోవద్దని, జగన్రెడ్డి తాత, తండ్రి మన జుట్టు కూడా పీకలేకపోయారు’’ అని టీడీపీ నేత లోకేష్ హెచ్చరించారు. వెంకటగిరిలో నారా లోకేష్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ నుండి లోక్సభలో 22 కోతులు, రాజ్యసభలో 6 కోతులున్నాయని ఎద్దేవాచేశారు. వీళ్లకు పార్లమెంట్లో నోరువిప్పి మాట్లాడే దమ్ము లేదన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కాదని, జేసీబీ ప్రభుత్వం ఉందన్నారు. జేసీబీ అంటే జగన్ సర్వీస్ బాదుడని లోకేష్ చెప్పారు. జగన్రెడ్డి ఒక చెల్లిని ఢిల్లీలో మరొకరిని హైదరాబాద్లో వదిలేశాడని తప్పుబట్టారు. దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం జగన్ పరామర్శించలేదన్నారు. జగన్ కేబినెట్లో అంతా బూతుల, నోటిపారుదల మంత్రులేనని ఎద్దేవాచేశారు. పసుపు జెండా చూస్తే జగన్కు ప్యాంట్ తడుస్తోందని లోకేష్ అన్నారు.