ఒంగోలు జాతి ఎడ్లు విశిష్టమైనవి

ABN , First Publish Date - 2021-01-26T05:58:29+05:30 IST

గోజాతిలో ఒంగోలు జాతి ఎడ్ల విశిష్టమైనవి, ఈ జాతిని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాఽథరాజు అన్నారు.

ఒంగోలు జాతి ఎడ్లు విశిష్టమైనవి
విజేతలకు బహుమతి అందిస్తున్న మంత్రి చెరుకువాడ

 వాటిని కాపాడుకోవాలి..

 మంత్రి చెరుకువాడ రంగనాథరాజు


నరసరావుపేట, జనవరి 25: గోజాతిలో ఒంగోలు జాతి ఎడ్ల విశిష్టమైనవి, ఈ జాతిని కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ రంగనాఽథరాజు అన్నారు. స్థానిక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఎడ్ల పందాల సభలో సోమవారం అయన ప్రసంగించారు. ఎంతో కష్టపడి ఒంగోలు జాతి గిత్తలను పోషిస్తున్న రైతులు అభినందనీయులన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్టాడుతూ ఎడ్ల బత ప్రదర్శన ఈ జాతిని కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. విజేతలకు మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి బహుమతులు అందించారు. రెండు పళ్ళ విభాగంలో డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత ప్రథమ స్థానం, శావల్యాపురం మండలం శానంపూడి అమృతపూడి కోటయ్య, మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన మెటమర్ది జక్రయ్యల ఎడ్ల జత ద్వితీయ, ప్రకాశం జిల్లా వీరాయపాలేనికి చెందిన వల్లాల సుభాషిణి, సుబ్రమణ్యం యాదవ్‌, నావచాపురం నక్కా లక్ష్మీనారాయణ ఎడ్ల జతకు తృతీయ, మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు ఎడ్ల జతకు నాలుగో స్థానంలో నిలిచాయి.  

Updated Date - 2021-01-26T05:58:29+05:30 IST