అవమానభారంతో ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-25T09:45:04+05:30 IST

మండలంలోని కాపర్లపల్లికి చెందిన నారాయణ (50) అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య గంగమ్మ తెలిపిన వివరాలివి.

అవమానభారంతో ఆత్మహత్య

కళ్యాణదుర్గం, అక్టోబరు 24: మండలంలోని కాపర్లపల్లికి చెందిన నారాయణ (50) అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య గంగమ్మ తెలిపిన వివరాలివి. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ పశువులు శుక్రవారం నారాయణ సోదరుడు అక్కులప్ప పొలంలో మేస్తున్నాయి. ఇదే విషయమై ప్రశ్నించినందుకు వెంకటనారాయణ, మధుసూదన్‌లు కలసి నారాయణపై దాడి చేసి కులంపేరుతో దూషించారు. దీంతో అవమానంగా భావించిన నారాయణ రాత్రి ఇంటికి వెళ్లలేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. శనివారం సమీప పొలాల్లో కానుగ చెట్టుకు నారాయణ ఉరేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-25T09:45:04+05:30 IST