స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం ఏపీనే..: నారాయణ
ABN , First Publish Date - 2021-12-17T23:24:34+05:30 IST
అమరావతి అనే శిశువును జగన్రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు.
తిరుపతి: అమరావతి అనే శిశువును జగన్రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు. జగన్రెడ్డి లాంటి మూర్ఖుడు మరొకరు ఉండరన్నారు. మహిళల కన్నీరు ఏపీకి మంచిది కాదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం ఏపీనేనని నారాయణ తెలిపారు.