సోమువీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారు?: నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-12-30T19:28:04+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సోమువీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారు?: నారాయణస్వామి

అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన  రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యారో అర్థంకావడం లేదన్నారు. రూ.50కే చీప్‌ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోష పెడతారా? అంటూ ప్రశ్నించారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని, మతాలను రెచ్చగొట్టడమే కాకుండా చీప్ లిక్కర్‌తో ఓటు అడుగుతున్నారంటూ నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓట్ల కోసం మరీ ఇంత చీఫ్‌గా మాట్లాడతారా? అంటూ సోషల్ మీడియాలో సోము వీర్రాజును ట్రోల్ చేస్తున్నారు. ‘సోము వైన్స్ సారాయి వీర్రాజు’ అంటూ నెటిజన్లు ఆయనను ఆడేసుకుంటున్నారు. ఇతర పార్టీ నేతలు సామాన్యులతోపాటు సొంతపార్టీ కార్యకర్తలు సయితం వీర్రాజు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు ట్వీట్లు పెట్టడంతో వీర్రాజుపై జాతీయ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.

Updated Date - 2021-12-30T19:28:04+05:30 IST