నారాయణ స్వామి ఆలయంలో పూజలు
ABN , First Publish Date - 2020-11-23T05:31:38+05:30 IST
నారాయణ స్వామి ఆలయంలో పూజలు
సీఎ్సపురం, నవంబరు 22 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎం.సత్యన్నారాయణశర్మ, ఎం.ప్రసాద్శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని అలంకరించి స్వామివారికి పంచామృతాభిషేకం, హారతులు, గోపూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మహానైవేథ్యంతో గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పించారు. గోపూజ నిర్వహించారు. ఆలయ కారనిర్వాహణాధికారి కే.నవీన్కుమార్, దేవస్థాన ఛైర్మన్ దుగ్గిరెడ్డి జయరెడ్డి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.