పాక్ ప్రమాదంలో 29కి పెరిగిన మృతుల సంఖ్య.. మోదీ సంతాపం
ABN , First Publish Date - 2020-07-04T05:27:34+05:30 IST
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫరూఖాబాద్లో రైలు వ్యాన్ను ఢీ కొట్టిన ఘటనలో మరణాల సంఖ్య 29కి పెరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ప్రెస్ రైలు ఫరూఖాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ను ఢీకొట్టింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫరూఖాబాద్లో రైలు వ్యాన్ను ఢీ కొట్టిన ఘటనలో మరణాల సంఖ్య 29కి పెరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ప్రెస్ రైలు ఫరూఖాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ను ఢీకొట్టింది. నన్కానా సాహిబ్ నుంచి సిక్కు యాత్రికులు తిరుగుప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు.