సోమనాథ్ ట్రస్ట్ భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ... ఆలయ అభివృద్ధిపై చర్చ!

ABN , First Publish Date - 2020-10-01T12:28:02+05:30 IST

సోమనాథ్ ట్రస్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఒక ట్వీట్ ద్వారా...

సోమనాథ్ ట్రస్ట్ భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ... ఆలయ అభివృద్ధిపై చర్చ!

న్యూఢిల్లీ: సోమనాథ్ ట్రస్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొన్నామని, ఆలయ అభివృద్ధితో పాటు స్థానిక పరిస్థితులు, సామూహిక పూజలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. 



ప్రసిద్ధ సోమనాథ్ మందిరం గుజరాత్ లో ఉంది. సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతుంటుంది. సోమనాథ్ మందిరం పర్యాటక ప్రాంతంగాను ఎంతో గుర్తింపుపొందింది. ఈ మందిరాన్ని 1951లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించారు. 1995లో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఈ మందిరాన్ని జాతికి అంకితం చేశారు.

Updated Date - 2020-10-01T12:28:02+05:30 IST