రైతులతో చర్చలకు సిద్ధం : నరేంద్ర సింగ్ తోమర్

ABN , First Publish Date - 2020-11-26T22:08:32+05:30 IST

రైతులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతులు చేస్తోన్న

రైతులతో చర్చలకు సిద్ధం : నరేంద్ర సింగ్ తోమర్

న్యూఢిల్లీ : రైతులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతులు చేస్తోన్న ఆందోళనలను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా కచ్చితంగా ఓ పరిష్కారం లభిస్తుందని, రైతులకున్న అపోహలు కూడా తొలగిపోతాయని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ప్రస్తుత పరిస్థితులకు అత్యంత ఆవశ్యకరమైనవని, అవి దేశంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు తేస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. పంజాబ్ రైతుల్లో నిండిపోయిన అపోహలను తొలగించే విషయంలో పంజాబ్ కార్యదర్శితో మాట్లాడామని, తిరిగి డిసెంబర్ మూడో తేదీన మరోమారు మాట్లాడతామని తోమర్ తెలిపారు .

Updated Date - 2020-11-26T22:08:32+05:30 IST