కలెక్టర్‌తో నర్సంపేట ఎమ్మెల్యే భేటీ

ABN , First Publish Date - 2020-07-03T11:26:57+05:30 IST

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పాకాల రంగాయచెరువు ప్రాజెక్టుకు సంబంధించి

కలెక్టర్‌తో నర్సంపేట ఎమ్మెల్యే భేటీ

ములుగు కలెక్టరేట్‌, జూలై 2: కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పాకాల రంగాయచెరువు ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని రైతులకు తక్షణమే అందించి న్యాయం చేయాలని కోరారు.  ములుగు సమీపంలో ఉన్న పాకాల రంగాయచెరువు ప్రాజెక్టు వద్ద హరితహారం కార్యక్రమం చేపట్టి ఆ ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని అన్నారు. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించిన ఆధునిక టెక్నాలజీని, తెలంగాణలోనే మొదటిసారిగా నిర్మాణం చేపట్టిన పైలాన్‌ పనులను పరిశీలించారు. మిగతా పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఆయన వెంట దేవాదుల ఈఈ సాయిబాబా, డీఈ రాజు ఉన్నారు.

Updated Date - 2020-07-03T11:26:57+05:30 IST