నాపై కరోనా కుట్ర చేస్తున్నారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2020-09-26T19:13:27+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నాకు కరోనా అంటించే కుట్ర చేస్తున్నారు. క్రిస్టియన్‌ దళితులతో నాపై దాడి

నాపై కరోనా కుట్ర చేస్తున్నారు: ఎంపీ రఘురామ

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నాకు కరోనా అంటించే కుట్ర చేస్తున్నారు. క్రిస్టియన్‌ దళితులతో నాపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారు. హిందువులు మేల్కొనాలి, మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఓ మతం మన్ననలు పొందేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోంది. ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. వైసీపీలోనే కొనసాగుతున్నా... కొత్త పార్టీ పెట్టే ఆలోచనలేదు’ అని రఘురామ స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T19:13:27+05:30 IST