నర్సరీ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-24T05:44:03+05:30 IST

నర్సరీల నిర్వాహకులు లైసెన్సుల ను రెన్యువల్‌ చేసుకోకుంటే చర్యలు తప్పవని మార్టూరు ఉద్యానశాఖాధికారి హన్మంత్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని వేమవ రం, ఉప్పుమాగులూరు గ్రామాల్లో నర్సరీల నిర్వాహకులు ఆ యన నోటీసులు అందజేశారు.

నర్సరీ లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోవాలి
నోటీసు అందజేస్తున్న హన్మంత్‌నాయక్‌

బల్లికురవ, జూన్‌ 23 : నర్సరీల నిర్వాహకులు లైసెన్సుల ను రెన్యువల్‌ చేసుకోకుంటే చర్యలు తప్పవని మార్టూరు ఉద్యానశాఖాధికారి హన్మంత్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని వేమవ రం, ఉప్పుమాగులూరు గ్రామాల్లో నర్సరీల నిర్వాహకులు ఆ యన నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం బల్లికురవలో గ్రామ వ్యవసాయ సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణపై చర్చించారు.  


Updated Date - 2021-06-24T05:44:03+05:30 IST