బీజేపీ వల్ల దేశంలో రైతులండరు..

ABN , First Publish Date - 2021-10-13T05:25:08+05:30 IST

బీజేపీ వల్ల దేశంలో రైతులండరు..

బీజేపీ వల్ల దేశంలో రైతులండరు..
సోడషపల్లిలో ఎమ్మెల్సీ పల్లాతో నారాయణమూర్తి

 సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి

ధర్మసాగర్‌, అక్టోబరు 12: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల వల్ల రైతులు ఉండరని సినీ నటు డు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. వేలేరు మండలం సోడషపల్లిలో మంగళవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు. రైతన్న సినిమా విడుదల కానున్నందున సిని మా చూడాలని ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మె ల్సీ వేలేరు మండలంలోని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సినిమా టికెట్‌ తన సొంత డబ్బులతో కొనుగోలు చేసి రైతన్న సిని మా చూపిస్తామని ఎమ్మెల్సీ నారాయణమూర్తికి హామీ ఇ చ్చారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేం ద్రం ప్రవేశపెట్టిన చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. కేంద్రం అన్నింటినీ ప్రైవేట్‌పరం చేసి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ స్వగ్రామం సోడషపల్లికి విచ్చేసిన సందర్భంగా నారాయణమూర్తిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సన్మానం చేశారు.





 

Updated Date - 2021-10-13T05:25:08+05:30 IST