పిచ్చయ్యకు నటనారత్న అవార్డు
ABN , First Publish Date - 2022-01-18T06:29:34+05:30 IST
శ్రీరామకృష్ణ ట్రస్ట్, బ్రాహ్మణ సేవా సమితి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో మఠంపల్లికి చెందిన గుంటి పిచ్చ య్యను నటనారత్న అవార్డుకు ఎంపిక చేశారు.
మఠంపల్లి, జనవరి 17: శ్రీరామకృష్ణ ట్రస్ట్, బ్రాహ్మణ సేవా సమితి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో మఠంపల్లికి చెందిన గుంటి పిచ్చ య్యను నటనారత్న అవార్డుకు ఎంపిక చేశారు. రంగస్థల నాటక, సినీ రంగంలో విశిష్ట సేవలను గుర్తించి సంస్థ ప్రతినిధులు జాతీయ అవార్డుకు తనను ఎంపిక చేశా రని పిచ్చయ్య సోమవారం తెలిపారు. ఈ అవార్డును ఈనెల 26న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే వేడుకల్లో సంస్థ చైర్మన్ వరప్రసాద్, నాగపద్మిని, హేమలత ప్రదానం చేస్తారని పిచ్చయ్య తెలిపారు.