నాట్కో మధ్యంతర డివిడెండ్‌

ABN , First Publish Date - 2020-08-13T06:02:39+05:30 IST

నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.122 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.142.8 కోట్లతో పోలిస్తే 14.5 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది...

నాట్కో మధ్యంతర డివిడెండ్‌

  • త్రైమాసిక లాభంలో 14శాతం క్షీణత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన  రూ.122 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.142.8 కోట్లతో పోలిస్తే 14.5 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.513.3 కోట్ల నుంచి రూ.582.1 కోట్లకు చేరింది.


ఫార్ములేషన్ల వ్యాపారంలో ఎగుమతులు పెరగడం ఆదాయ వృద్ధికి దోహదం చేసింది. 2020, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఫార్ములేషన్ల వ్యాపారంలో మార్జిన్ల ఒత్తిడి ఎదురైనట్లు నాట్కో వెల్లడించింది. 2020-21కి లాభంలో 25 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 (62.5ు)  మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. 


Updated Date - 2020-08-13T06:02:39+05:30 IST