ఫీడింగ్ చాంబర్కు జాతీయస్థాయి అవార్డు
ABN , First Publish Date - 2021-12-04T03:45:05+05:30 IST
ఇన్స్సైర్ జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో మల్కే పల్లి ఆశ్రమ పాఠశాలకు జాతీయస్థాయిలో 4వ స్థానం దక్కింది. గతేడాది నిర్వహించిన పోటీలో విద్యార్థి అంజి రూపొందించిన ఫీడింగ్ చాంబర్కు ఈ అవార్డు లభించింది.
కాసిపేట, డిసెంబరు 3: ఇన్స్సైర్ జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో మల్కే పల్లి ఆశ్రమ పాఠశాలకు జాతీయస్థాయిలో 4వ స్థానం దక్కింది. గతేడాది నిర్వహించిన పోటీలో విద్యార్థి అంజి రూపొందించిన ఫీడింగ్ చాంబర్కు ఈ అవార్డు లభించింది. అవార్డును పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు వేముల వాడ రమేష్, విద్యార్ధి అంజిలు శుక్రవారం బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్స్, ఐఐఎస్ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమం లో ఎన్ఐఎఫ్ డైరెక్టర్ విపిన్కుమార్, ఇస్రో చైర్మన్ పీఎస్ గోయల్ చేతులమీ దుగా అందుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్రెడ్డిలు అభినందనలు తెలిపారు.