తెలంగాణలో క్రీడ‌ల అభివృద్ధికి చొర‌వ తీసుకోవాలి: జ‌గ‌న్‌మోహ‌న్ రావు

ABN , First Publish Date - 2020-08-11T02:50:05+05:30 IST

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి చొర‌వ తీసుకోవాల‌ని జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్య‌క్షుడు అరిస‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు కోరారు.

తెలంగాణలో క్రీడ‌ల అభివృద్ధికి చొర‌వ తీసుకోవాలి: జ‌గ‌న్‌మోహ‌న్ రావు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి చొర‌వ తీసుకోవాల‌ని జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్య‌క్షుడు అరిస‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు కోరారు. ఇటీవ‌ల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ, ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రీనివాస‌రాజును ఆయ‌న కార్యాల‌యంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రావు మ‌ర్యాద‌పూర్య‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్‌డౌన్ 3.0లో క్రీడా స‌ముదాయాల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వ‌డంతో ఆ దిశ‌గా రాష్ట్రంలోనూ క్రీడా శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ముఖ కోచ్‌లు, క్రీడా నిపుణుల స‌ల‌హాలు తీసుకొని క్రీడాకారుల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఒక‌ ప్రామాణిక నిబంధ‌న‌ల ప‌త్రం త‌యారు చేయాల‌ని జగన్ మోహన్ రావు కోరారు.

Updated Date - 2020-08-11T02:50:05+05:30 IST