పోలవరం నిర్వాసితుల గోడుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్
ABN , First Publish Date - 2021-07-20T19:54:27+05:30 IST
పోలవరం నిర్వాసితుల గోడుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్కు తూర్పుగోదావరి జిల్లా
అమరావతి: పోలవరం నిర్వాసితుల గోడుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఎస్సీ కమిషన్ నోటీసులిచ్చింది. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ స్పందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూనవరం, వీఆర్పురం మండలాల్లోని షెడ్యూల్ జాతులను బలవంతంగా ఖాళీ చేయించడంపై కమిషన్ నివేదిక కోరింది. పునరావాసం కల్పించకుండా తరలించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది.