జాతీయ టీ20 చాంపియన్ ఆంధ్ర
ABN , First Publish Date - 2021-11-26T10:15:09+05:30 IST
అంధుల జాతీయ టీ20 ట్రోఫీని ఆంధ్ర జట్టు సొంతం చేసుకొంది. గురువారం గురుగ్రామ్లో కర్ణాటకతో జరిగిన ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో గెలిచింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అంధుల జాతీయ టీ20 ట్రోఫీని ఆంధ్ర జట్టు సొంతం చేసుకొంది. గురువారం గురుగ్రామ్లో కర్ణాటకతో జరిగిన ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత ఆంధ్ర 20 ఓవర్లలో 231/3 స్కోరు సాధించింది. సెంచరీ హీరో దుర్గారావు (104 నాటౌట్), వెంకటేశ్వర్ రావు (85) తొలి వికెట్కు 145 రన్స్ జోడించారు. ఛేదనలో కర్ణాటక 20 ఓవర్లలో 204/3 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ ప్రకాష్ జయరామయ్య (119) శతకం సాధించినా ఫలితం లేకపోయింది.