వచ్చే నెలలో మహిళల ఫుట్బాల్ శిబిరం
ABN , First Publish Date - 2020-11-22T09:18:23+05:30 IST
లాక్డౌన్ తర్వాత తొలిసారి జాతీయ మహిళల ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరం వచ్చే నెల ఒకటో తేదీన గోవాలో ప్రారంభంకానుంది
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత తొలిసారి జాతీయ మహిళల ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరం వచ్చే నెల ఒకటో తేదీన గోవాలో ప్రారంభంకానుంది. ప్రధాన కోచ్ మెమోల్ రాకీ ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారిణులు శిక్షణలో పాల్గొననున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 2022 మహిళల ఆసియా కప్ సన్నద్ధతలో భాగంగా ఈ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నట్టు జాతీయ జట్టు డైరెక్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు.