కరోనా కాలంలో పేదలకు అండగా నాట్స్..!

ABN , First Publish Date - 2020-08-13T03:46:52+05:30 IST

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

కరోనా కాలంలో పేదలకు అండగా నాట్స్..!

గుంటూరు:  అమెరికాలో  తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. గుంటూరు నగరంలో 100 కుటుంబాలకు నాట్స్ న్యూజెర్సీ విభాగం నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ సెక్రటరీ రంజీత్ చాగంటి సహకారంతో న్యూజెర్సీ నాట్స్ విభాగం ఈ కార్యక్రమం చేపట్టింది.  కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రంజిత్ చాగంటి చూపిన చొరవను నాట్స్ నాయకత్వం ప్రశంసించింది. కాగా.. పనుల్లేక ఇబ్బంది పడుతున్న తమకు.. నాట్స్ సాయం చేయడంపట్ల పేదలు హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2020-08-13T03:46:52+05:30 IST