హైదరాబాద్‌లోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నాట్స్

ABN , First Publish Date - 2020-05-24T03:14:35+05:30 IST

అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

హైదరాబాద్‌లోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నాట్స్

హైదరాబాద్: అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు బాసటగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో ఉండే నిరుపేదలకు, దినసరి కూలీలకు నాట్స్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కాలనీల్లో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్య గురంచి స్థానిక పెద్దలు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు. దీంతో స్థానిక శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నాట్స్.. నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. కరోనా కష్టకాలంలో పేదలకు సాయం చేసిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రశంసించారు. 


Updated Date - 2020-05-24T03:14:35+05:30 IST