‘టాటా’తో నవభారత్ ఒప్పందం
ABN , First Publish Date - 2020-12-04T06:15:37+05:30 IST
టాటా స్టీల్ లిమిటెడ్ (టీఎ్సఎల్) అనుబంధ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్ (టీఎ్సఎంఎల్)తో నవభారత్ వెంచర్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా స్టీల్ లిమిటెడ్ (టీఎ్సఎల్) అనుబంధ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్ (టీఎ్సఎంఎల్)తో నవభారత్ వెంచర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. హై కార్బన్ ఫెర్రో క్రోమ్ను తయారు చేసి ఇవ్వడానికి టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ఈ ఒప్పందం డిసెంబరు ఒకటి నుంచి అమలులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. 2025 మార్చి వరకూ ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఒడిసా ప్లాంట్లోని స్మెల్టింగ్ సామర్థ్యాన్ని ఇందుకోసమే వినియోగిస్తారు. ఏడాదికి 70 వేల టన్నుల హై కార్బన్ ఫెర్రో క్రోమ్ను తయారు చేస్తారు.