విద్యుత్ తీగను తాకిన ఇనుప నిచ్చెన... బాలుడు దుర్మరణం!

ABN , First Publish Date - 2021-02-23T15:51:06+05:30 IST

మహారాష్ట్రలోని ఎయిరోలీలో 12 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి...

విద్యుత్ తీగను తాకిన ఇనుప నిచ్చెన... బాలుడు దుర్మరణం!

ముంబై: మహారాష్ట్రలోని ఎయిరోలీలో 12 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. రోడ్డు పక్కన ఉంచిన ఇనుప నిచ్చెనను ఆ బాలుడు తాకాడు. అయితే ఆ నిచ్చెనకు ఒక విద్యుత్ తీగ తగులుకుని ఉంది. ఈ నేపధ్యంలో దానిలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహం కారణంగా ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది క్షణాల్లోనే ఆ బాలుని శరీరం పూర్తిగా కాలిపోయింది. రబలె పోలీసు అధికారి యోగేష్ గావ్డే మాట్లాడుతూ విద్యుదాఘాతంతో మృతి చెందిన బాలుడిని గుర్తించాల్సివుందన్నారు. ఫుట్‌పాత్ మీద వెళుతున్న ఆ బాలుడు నిచ్చెనను తాకిన కారణంగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేశారు. 



Updated Date - 2021-02-23T15:51:06+05:30 IST