Punjabలో మాట నెగ్గించుకున్న సిద్ధూ
ABN , First Publish Date - 2021-11-09T23:52:12+05:30 IST
పంజాబ్లో మాట నెగ్గించుకున్న సిద్ధూ
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సిద్ధూ పంతం నెగ్గించుకున్నారు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్ రాజీనామా చేసేదాకా పీసీసీ బాధ్యతలు మళ్లీ స్వీకరించబోనని సిద్ధూ మొండికేయడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏజీ చేత రాజీనామా చేయించింది. డియోల్ రాజీనామాను ఆమోదించానంటూ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ స్వయంగా ప్రకటించారు. అకాలీదళ్కు అనుకూలంగా అనేక కేసులు వాదించిన డియోల్ను..అడ్వకేట్ జనరల్గా నియమించడాన్ని సిద్ధూ వ్యతిరేకించారు. సిద్ధూ గతంలో కూడా కెప్టెన్ అమరీందర్సింగ్కు వ్యతిరేకంగా బలంగా వాణి వినిపించారు. సిద్ధూ ఒత్తిడికి లొంగిన అధిష్టానం చివరకు కెప్టెన్ను సీఎం పదవి నుంచి తప్పించింది.