ఎంఎస్‌ఎంఈలకు ఊరట

ABN , First Publish Date - 2021-04-06T06:41:31+05:30 IST

దివాలా ప్రక్రియకు దగ్గర్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఊరట కల్పించేందుకు కేంద్రం మరో చర్య తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది...

ఎంఎస్‌ఎంఈలకు ఊరట

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియకు దగ్గర్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఊరట కల్పించేందుకు కేంద్రం మరో చర్య తీసుకుంది. ఇందుకోసం ఏకంగా ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ సంస్థల వ్యాపారాలు, అందులో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలకు పెద్దగా ఇబ్బంది లేకుండా ముందస్తు ప్యాకేజీకి ఈ ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈల రుణదాతలు, వాటాదారులు ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే ముందే పరిష్కారం కోసం ఒక అంగీకారానికి రావచ్చు. ఆ తర్వాత దాన్ని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-04-06T06:41:31+05:30 IST