నితీష్ నాయకత్వంలో ఎన్‌డీఏ గెలుపు తథ్యం: నడ్డా

ABN , First Publish Date - 2020-02-22T23:15:10+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని బీజేపీ జాతీయ..

నితీష్ నాయకత్వంలో ఎన్‌డీఏ గెలుపు తథ్యం: నడ్డా

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. పాట్నాలో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో బీహార్ ముఖచిత్రాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం మార్చేసిందని, నితీష్ నాయకత్వంలోనే వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.


ఎన్డీయే విజయానికి కార్యకర్తలు పూర్తి శక్తియుక్తులు వినియోగించి ప్రచారం సాగించాలని నడ్డా కోరారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరంఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలిచితీరుతామని ఆయన కార్తకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.


దీనికి ముందు నడ్డా ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, జహవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ చెరో రెండుసార్లు, రాజీవ్ గాంధీ ఒకసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చారని, అయినా 370 అధికరణను రద్దు చేయలేకపోయారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గత మేలో సొంతంగా 303 మంది ఎంపీలతో అధికారంలోకి వచ్చి, ఆగస్టులో 370 అధికరణను రద్దు చేసిందని చెప్పారు. నడ్డా శనివారంనాడు తనఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సైతం కలుసుకోనున్నారు.

Updated Date - 2020-02-22T23:15:10+05:30 IST