అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలి
ABN , First Publish Date - 2020-08-05T11:29:30+05:30 IST
కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ..
నెల్లూరు(వైద్యం), ఆగస్టు 4 : కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామకృష్ణారావు, డాక్టర్ నిరంజన్, డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. గూడూరు, కావలి, ఆత్మకూరు ఏరియా ఆసుపత్రులతోపాటు పొదలకూరు, వెంకటాచలం, అల్లూరు, వింజమూరు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనే కరోనా బాధితులకు సేవలు అందించాలని అధికారులు నిర్ణయించిన నేపఽథ్యంలో అయా ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. అలాగే వాహన సదుపాయం కల్పించాలని కోరారు.