సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-10-17T05:29:51+05:30 IST
ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. .
- ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
దండేపల్లి, అక్టోబరు 16: ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. . దండేపల్లి మండలం ముత్యంపేటలో కోర్విచెల్మ వేళ్లు రహదారిలో మోటపల్కుల పోచయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటపల్కుల గురువయ్య- రాజన్న ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, సహకార సంఘం చైర్మన్లు లింగన్న, సురేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ రాజేందర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.