వ్యూహాత్మక పోరాటాలకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-04-14T06:33:37+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక అమ్మకాలను ఆపేందుకు దేశ ప్రజలంతా పోరాటాలకు సన్నద్ధం కావాలని ముస్లిం థింకర్స్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ జహాఆర పిలుపునిచ్చారు.

వ్యూహాత్మక పోరాటాలకు సన్నద్ధం కావాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జహాఆర

ముస్లిం థింకర్స్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ జహాఆర 

సిరిపురం, ఏప్రిల్‌ 13: విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక అమ్మకాలను ఆపేందుకు దేశ ప్రజలంతా పోరాటాలకు సన్నద్ధం కావాలని ముస్లిం థింకర్స్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ జహాఆర పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం ఆమె హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ వ్యాపారం చేయనని చెబుతూనే పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు వ్యూహాత్మక పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ యూనియన్‌ నాయకులు పూర్ణిమ, కనకరాజు, పడాల రమణ, జగ్గునాయుడు, వై.మణి, మేరీ, కనకరత్నం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T06:33:37+05:30 IST